కొవిడ్-19 టీకాను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-02-25T04:56:07+05:30 IST
కొవిడ్-19 టీకాను సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): కొవిడ్-19 టీకాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. కొవిడ్ టీకాపై అవగాహన కల్పించే మొబైల్ వాహనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొవిడ్ టీకాపై అపోహలు వీడాలన్నారు. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. టీకా వేసుకోవడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. ముందస్తుగా 10 రోజుల పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ కాలనీలు, బస్తీల్లో వాహనం పర్యటిస్తుందన్నారు. వాహనంలో వీడియో ద్వారా టీకాపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి సుభాశ్చంద్రబో్స, జిల్లా మాస్మీడియా అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి ప్రకాశ్రెడ్డి, దివ్య, తుల్జారాం, నాగమణి పాల్గొన్నారు.