రాజకీయ కక్షతోనే నిధుల దుర్వినియోగం అభియోగం

ABN , First Publish Date - 2020-07-10T11:05:23+05:30 IST

అధికార పార్టీ నేతల మాటలు విని అధికారులు రాజకీయ కక్షతోనే రికార్డులు పరిశీలించకుండా..

రాజకీయ కక్షతోనే నిధుల దుర్వినియోగం అభియోగం

మాజీ సర్పంచు మొబీనా రియాజ్‌


ఉదయగిరి రూరల్‌, జూలై 9: అధికార పార్టీ నేతల మాటలు విని అధికారులు రాజకీయ కక్షతోనే రికార్డులు పరిశీలించకుండా నిధులు దుర్వినియోగం చేసినట్లు నిందలు వేయడం తగదని మాజీ సర్పంచు షేక్‌ మొబీనారియాజ్‌ పేర్కొన్నారు. గురువారం చెంచలబాబుయాదవ్‌ నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  2017- 18, 18-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు ఆడిటర్‌ వద్ద ఉన్నాయని, వాటిని పరిశీలించకుండానే విచారణ చేపట్టి రూ.1.14 కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డారని నోటీసు జారీ చేయడం దారుణమన్నారు. దుర్వినియోగం చేసిన నిధుల వివరాలు తెలియచేస్తే ప్రతిదానికి రికార్డు చూపుతానని చెప్పారు. పారిశుధ్య కార్మికుల 5 నెలల వేతనాల కోసం తన బంగారం తాకట్టు పెట్టి రూ.12 లక్షలు చెల్లించానని, ఇంతవరకు ఆ నగదు కూడా పంచాయతీ ఇవ్వలేదన్నారు.

Updated Date - 2020-07-10T11:05:23+05:30 IST