మొబైల్ మంత్రాలతో వివాహం
ABN , First Publish Date - 2021-03-04T05:26:17+05:30 IST
మొబైల్ మంత్రాలతో వివాహం
కేసముద్రం, మార్చి 3: తాళ్లపూసపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం వినూత్న పద్ధతిలో వివాహం జరిపించారు. పురోహితుడు మొబైల్లో మంత్రాలు చదువుతుండగా వేడుక నిర్వహించారు. మహబూబాబాద్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన కబీర్దాస్ అదే రాష్ట్రానికి చెంది న కవిత ప్రేమించుకున్నారు. మహబూబాబాద్ వాసుల సహకారంతో వి వాహం చేసుకునేందుకు ఆలయానికి రాగా పురోహితుడు అందుబాటులో లేడు. దీంతో ఆయనకు ఫోన్చేయగా మొబైల్లోనే మంత్రాలు ఉచ్ఛరిస్తుండగా వేడుకలకు హాజరైన పెద్దలు పెళ్లి తంతు పూర్తిచేశారు.