మొబైల్‌ మంత్రాలతో వివాహం

ABN , First Publish Date - 2021-03-04T05:26:17+05:30 IST

మొబైల్‌ మంత్రాలతో వివాహం

మొబైల్‌ మంత్రాలతో వివాహం
తాళ్లపూసపల్లిలో మొబైల్‌ మంత్రాలతో జరుగుతున్న వివాహం

కేసముద్రం, మార్చి 3:  తాళ్లపూసపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం వినూత్న పద్ధతిలో వివాహం జరిపించారు. పురోహితుడు మొబైల్‌లో మంత్రాలు చదువుతుండగా వేడుక నిర్వహించారు. మహబూబాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన కబీర్‌దాస్‌ అదే రాష్ట్రానికి చెంది న కవిత ప్రేమించుకున్నారు. మహబూబాబాద్‌ వాసుల సహకారంతో వి వాహం చేసుకునేందుకు ఆలయానికి రాగా పురోహితుడు అందుబాటులో లేడు. దీంతో ఆయనకు ఫోన్‌చేయగా మొబైల్‌లోనే మంత్రాలు ఉచ్ఛరిస్తుండగా వేడుకలకు హాజరైన పెద్దలు పెళ్లి    తంతు పూర్తిచేశారు.



Updated Date - 2021-03-04T05:26:17+05:30 IST