మొబైల్ పశు వైద్య వాహనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-24T03:31:01+05:30 IST
నియోజకవర్గంలోని పశుపోషకుల సౌకర్యార్థం మొబైల్ పశువైద్య వాహనాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సోమవారం
కందుకూరు, మే 23: నియోజకవర్గంలోని పశుపోషకుల సౌకర్యార్థం మొబైల్ పశువైద్య వాహనాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సోమవారం ప్రారంభించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొబైల్ పశువైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నందున పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తిగా ఉచిత సేవలు అందించటంతోపాటు అవసరమైన మందులు కూడా అంద జేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఉమాదేవి, పశువైద్య శాఖ డీడీ చంద్రశేఖర్, ఎంపీపీ ఇంటూరి సుశీల, తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.