ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు కోవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-24T01:30:08+05:30 IST
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు కోవిడ్ పాజిటివ్
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రేతోపాటు ఆయన తల్లి కుందా థాక్రే కరోనా వైరస్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ఇద్దరికి స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు వారు దాదర్ ప్రాంతంలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరంలో ముంబైలో స్థానిక ఎన్నికలు ఉండడంతో పార్టీ నేతలతో కలిసి థాక్రే (53) ఇటీవల నాసిక్, పుణెలో పర్యటించారు.