ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదు: ఎమ్మెల్సీ వాణి దేవి

ABN , First Publish Date - 2021-12-23T17:31:40+05:30 IST

పీవీ నరసింహరావును జాతి రత్నంగా పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు.

ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదు: ఎమ్మెల్సీ వాణి దేవి

హైదరాబాద్: పీవీ నరసింహరావును జాతి రత్నంగా పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ దగ్గర ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీవీ శత జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఘనతంగా నిర్వహించిందన్నారు. ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదన్నారు. పీవీ తన విఘ్నతతో దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఎన్నో ఉపన్యాసాలు, కవితలు పీవీ మీద వస్తున్నాయని, ప్రమాదం అంచున ఉన్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించిన ఘనత పీవీదేనని వాణి దేవి కొనియాడారు.

Updated Date - 2021-12-23T17:31:40+05:30 IST