MLC Madhav: సీఎం జగన్‌పై ఎమ్మెల్సీ మాధవ్ మండిపాటు

ABN , First Publish Date - 2022-08-02T20:16:34+05:30 IST

సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

MLC Madhav: సీఎం జగన్‌పై ఎమ్మెల్సీ మాధవ్ మండిపాటు

విశాఖ (Visakha): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ (MLC Madhav) మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (AP) సర్వనాశనం చేశారని అన్నారు. రుషికొండ నిర్మాణాలు.. వైసీపీ (YCP) చేస్తున్న అతిపెద్ద అరాచకమని అన్నారు. రుషికొండ ఏరియాలో ముఖ్యమంత్రి నివాసం నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం విషయంలో మాట తప్పి.. మడమ తిప్పారని, కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం.. జగన్ సర్కార్ ప్రజలకు ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకే ఉచిత బియ్యం అందుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. 

Updated Date - 2022-08-02T20:16:34+05:30 IST