పెన్షనర్లకు సోమేశ్వరరావు సేవలు ఎనలేనివి

ABN , First Publish Date - 2021-04-21T05:23:18+05:30 IST

పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కొనకంచి సోమేశ్వరరావు విశేషకృషి చేశారని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు.

పెన్షనర్లకు సోమేశ్వరరావు సేవలు ఎనలేనివి
సోమేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు

ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు 

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 20: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కొనకంచి సోమేశ్వరరావు విశేషకృషి చేశారని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం తాలుకా ఆవరణలోని పెన్షన్‌ భవన్‌లో ఏర్పాటుచేసి సంతాపసభలో ఆయన మాట్లాడారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా 17 సంవత్సరాలు సేవలు అందించారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.వెంకటేశ్వర్లు, కోశాధికారి టీవీఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ, అదనపు కార్యదర్శులు జి.రామానుజరావు, వి.జగన్మోహిని, ఐ.నారాయణస్వామి, జి.గౌరీకాంత్‌, కె.నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణయ్య, జి.ప్రభుదాస్‌, కె.పిచ్చయ్య, సంయుక్త కార్యదర్శులు జయశ్రీ, పి.శ్యామసుందర్‌, పి.సుబ్బారెడ్డి, ఆఫీస్‌ మేనేజర్‌ ఎం.రవిశంకర్‌ తదితరులు పాల్గొని నివాళలర్పించారు.

Updated Date - 2021-04-21T05:23:18+05:30 IST