Telangana bhavan: రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2022-08-17T16:23:33+05:30 IST
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా తెలంగాణ భవన్లో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా తెలంగాణ భవన్ (Telangana bhavan)లో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (Kavitha) రక్తదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ... స్వంతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను మన వంతు బాధ్యతగా పంచుకోవాలని అన్నారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటి అని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకు పెరుగుతోందన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని అన్నారు. నిరుద్యోగం మతతత్వాన్ని సమూలంగా ఈ దేశం నుంచి రూపుమాపాలని తెలిపారు. ప్రపంచానికి దిక్సూచిగా భారతదేశం ఎదగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.