చివరి దశకు మెట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు

ABN , First Publish Date - 2021-06-09T21:12:39+05:30 IST

జిల్లాలో నిర్మిస్తున్న మెట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు చివరి దశకు చేరుకున్నాయని

చివరి దశకు మెట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు

నిజామాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మెట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోనే అత్యున్నత టెక్నాలజీతో ప్యాకేజీ 21 నిర్మాణం అవుతోందని కవిత పేర్కొన్నారు. రైతులు తమ భూములను కోల్పోకుండా భూగర్భం నుంచే పైప్ లైన్స్ వెళ్తున్నాయని కవిత తెలిపారు. ప్యాకేజీ 21తో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కరోనా మూడో వేవ్‌ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కవిత తెలిపారు. రాష్ట్రంలో మూడో వేవ్ రాదనే అనుకుంటున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వైద్య సదుపాయాలు సిద్ధం చేస్తున్నామని కవిత తెలిపారు.

Updated Date - 2021-06-09T21:12:39+05:30 IST