కాళేశ్వరం అంతా తప్పుల తడక: Jeevan reddy
ABN , First Publish Date - 2022-01-11T19:23:01+05:30 IST
తెలంగాణ హక్కులను కేసీఆర్ ఫణంగా పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.
జగిత్యాల: తెలంగాణ హక్కులను కేసీఆర్ ఫణంగా పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వెన్ గంగా నీళ్లను వద్దని.. వార్దా నీళ్లను మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎగువ నీటిని కిందికి వదిలి మళ్లీ పైకి ఎత్తి పోయడం తెలివితక్కువ తనమన్నారు. కాళేశ్వరం డొల్లతనం బయట పడకుండా కేసీఆర్ కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంతా తప్పుల తడకన్నారు. కేసీఆర్ తప్పు మీద తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. మేధావులు, సాంకేతిక వర్గం బయటకు వచ్చి కేసీఆర్ను నిలదీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.