కాళేశ్వరం జలాలను కరీంనగర్ జిల్లాకు అందించాలి

ABN , First Publish Date - 2021-08-27T01:03:32+05:30 IST

కాళేశ్వరం జలాలను మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అందించాలని ప్రభుత్వాన్ని

కాళేశ్వరం జలాలను కరీంనగర్ జిల్లాకు అందించాలి

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అందించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్వ కరీంనగర్ జిల్లాకు అందించిన తర్వాతనే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు అందించాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌లోపు గౌరవెల్లి-గండిపల్లి ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అందించాలన్నారు. ప్రాజెక్టుకు బాహుబలి మోటార్లు అమర్చాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-08-27T01:03:32+05:30 IST