రైతుల ఇబ్బందులు మంత్రికి పట్టవా? .. Jeevan Reddy
ABN , First Publish Date - 2022-05-28T22:27:57+05:30 IST
జగిత్యాల: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మూడు కిలోల కోతపై ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ లక్ష్మణ్ దీక్ష బూనారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన దీక్షను
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మూడు కిలోల కోతపై ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ లక్ష్మణ్ దీక్ష బూనారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన దీక్షను విరమింపజేసి, మంత్రి కొప్పుల ఈశ్వర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులను తెలుసుకోవాల్సిన బాధ్యత మంత్రికి లేదా? ఒక్క కొనుగోలు కేంద్రమైనా తిరిగారా? అని ప్రశ్నించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టేదెవరు అంటూనే.. విచారణకు ఆదేశిస్తే.. వాస్తవ పరిస్థితులను నిరూపిస్తానని సవాల్ విసిరారు.