‘దళిత బంధు’.. మేడిపండు వంటిది: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-31T21:09:29+05:30 IST

జగిత్యాల: దళిత బంధు పథకం మేడిపండు వంటిదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మపురి పట్టణంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు.

‘దళిత బంధు’.. మేడిపండు వంటిది: జీవన్ రెడ్డి

జగిత్యాల: దళిత బంధు పథకం మేడిపండు వంటిదని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మపురి పట్టణంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళితబంధు పథకం వల్ల సమాజంలో ఇతరుల దృష్టిలో దళితులపై ఈర్ష భావం  పెరుగుతుందని చెప్పారు. గడిచిన ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల కోసం పోరాడాల్సిన బాధ్యత.. దళిత మంత్రిగా ఈశ్వర్‌పైనే ఉందని జీవన్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-08-31T21:09:29+05:30 IST