50 లక్షల పరిహారం ఇవ్వాలి: జీవన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-06-09T20:33:32+05:30 IST

కరోనాతో చనిపోయిన వారి బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని

50 లక్షల పరిహారం ఇవ్వాలి: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్: కరోనాతో చనిపోయిన వారి బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఉందని హెచ్చరికలు వస్తున్నా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మన్ భారత్ అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాసుప్రతుల్లో వైద్య సిబ్బంది నియామకంపై ఎటువంటి చర్యలను తీసుకోలేదని ఎమ్మెల్సీ ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-06-09T20:33:32+05:30 IST