ఆ రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం: గెల్లు శ్రీనివాస్ యాదవ్

ABN , First Publish Date - 2020-10-11T23:11:08+05:30 IST

రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. పట్టభద్రులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు.

ఆ రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం: గెల్లు శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. పట్టభద్రులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాండు గౌడ్ ఆధ్వర్యంలో ఆర్.కె.పురం డివిజన్‌లోని కెనరా ఫంక్షన్ హాల్లో జరిగిన రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల్లో విజయానికి దోహదం చేస్తాయన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో 11 వేల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి యాదవ్, టీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు జహీర్ ఖాన్, ఎల్బీ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, సీనియర్ నాయకులు జావీద్, యన్ యన్ రాజు, దశరథ్ సచిన్, బాలు, వల్లాల క్రాంతి, భాస్కర్, కిరణ్ తేజ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-11T23:11:08+05:30 IST