Mlc Elections: పరిషత్ టికెట్ కోసం Bjpలో తీవ్ర పోటీ
ABN , First Publish Date - 2022-07-23T18:53:02+05:30 IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress Mlc) ఇబ్రహీం రాజీనామాతో ఖాళీ అయిన విధానపరిషత్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం
బెంగళూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress Mlc) ఇబ్రహీం రాజీనామాతో ఖాళీ అయిన విధానపరిషత్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దాని కోసం బీజేపీ(Bjp)లో పోటీ ప్రారంభమైంది. శాసనసభలో బీజేపీకి 121 మంది సభ్యుల బలం ఉండడంతో సునాయాసంగా గెలుచుకోనుంది. బహుశా ఎన్నిక కూడా ఏకగ్రీవం కావచ్చునని భావిస్తున్నారు. మాజీ మంత్రి(Ex Minister) దివంగత గురుపాదప్ప నాగమారపల్లి కుమారుడు సూర్యకాంత నాగమారపల్లి, హుమ్నాబాద్ మాజీ ఎమ్మెల్యే(Ex Mla) సుభాష్ కల్లూరు ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి ఈసారి అవకాశం కల్పించాలని బీజేపీ(Bjp) నేతల్లో డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు గీతా వివేకానంద కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 75 మంది సభ్యులు కల్గిన విధానపరిషత్లో ఈ స్థానం కూడా గెలిస్తే బీజేపీ బలం 40కు చేరుకోనుంది.