ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-07T01:45:08+05:30 IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద
శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు పై మండిపడ్డారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు వందలాది శిలాఫలకాలు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్లు వేసిన శిలాఫలకాలను వదలలేదన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టెక్కలి ఆసుపత్రి శిలాఫలకం తానే పగులగొట్టానని, మిస్టర్ అచ్చెన్నాయుడు ఏమి పీక్కుంటావో పీక్కో అని తీవ్రస్థాయలో హెచ్చరించారు.