స్పీకర్ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ
ABN , First Publish Date - 2021-02-27T05:42:56+05:30 IST
స్పీకర్ తమ్మినేని సీతారాంను తొగరాం గ్రామంలో వైసీపీ ఎమ్మె ల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమదాలవలస రూరల్/ పాలకొండ, ఫిబ్రవరి 26: స్పీకర్ తమ్మినేని సీతారాంను తొగరాం గ్రామంలో వైసీపీ ఎమ్మె ల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్తో మాట్లాడి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ తదితరులు ఉన్నారు. పాలకొండలో వైసీపీ సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ను దువ్వాడ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తల్లి ఆశీసులు...
పలాస: ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న దు వ్వాడ శ్రీనివాస్ స్థానిక శివాజీన గర్లో నివాసముంటున్న తన తల్లి లీలావతిని శుక్రవారం కలుసుకుని ఆశిసులు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆమె స్వీట్ తినిపించి కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజను మర్యాదపూ ర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట దువ్వాడ సోదరులు శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు.