దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నాం: Ashok

ABN , First Publish Date - 2021-12-14T18:10:26+05:30 IST

దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.

దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నాం: Ashok

అమరావతి: దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం ఫిట్మెంట్ చాలు అని నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 43 శాతం కావాలి అని అడిగామని... ఇబ్బందులు ఉన్నా ఇచ్చారని తెలిపారు. జీతాలు పెంచమని అడిగితే... తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


2022 అక్టోబర్ నుంచి పీఆర్సీ ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ఉద్యోగ సంఘాలు అక్కా బావా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 36 శాతం ఆదాయం ఉద్యోగులకే ఖర్చు అవుతుంది అనేది తప్పుడు నివేదికన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ విలీనం, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వల్లనే ఖజానాపై రూ.6700 కోట్ల భారం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో భోజనం చేసే జగన్... 9, 10 షెడ్యూల్ ఆస్తులు తీసుకురాలేరా!? అని అశోక్ బాబు ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-14T18:10:26+05:30 IST