అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-06T04:52:35+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

  • ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

ఆమనగల్లు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శనివారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో  నాయకులు అజీజ్‌, నరేశ్‌, వడ్డె రాజు, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌, నరేశ్‌నాయక్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


సీఎం సహాయ నిధి పేదలకు వరం 


సీఎం సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు. కడ్తాల మండలం మర్రిపల్లికి చెందిన గణేశ్‌గౌడ్‌కు రూ.44 వేలు, ఎక్వాయిపల్లికి చెందిన బి.చంద్రయ్యకు రూ.44 వేలు, పద్మకు రూ.12 వేలు, వెల్దండకు చెందిన యాకూబ్‌ అలీకి రూ.1.50 లక్షలు, తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన ఆర్‌.రేణుకకు రూ.లక్ష ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, జోగు వీరయ్య, భూపతిరెడ్డి, సుంకరి జంగయ్య, వెంకటయ్య, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:52:35+05:30 IST