బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

ABN , First Publish Date - 2022-05-11T05:27:59+05:30 IST

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంగళవారం పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


బాన్సువాడ/ పిట్లం మే 10 : ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంగళవారం పరామర్శించారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో పాటు, బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అంజవ్వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి ఓదార్చారు. తన ప్రగాఽఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉంటానని ఆయన ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం త్వరగా అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉండి ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని పథకాలు అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు వెంకట్‌రాం రెడ్డి, స్పీకర్‌ పీఏ భగవాన్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఎర్వాల కృష్ణారెడ్డి, రూరల్‌ సీఐ మురళి, తదితరులు ఉన్నారు.

Read more