కేసీఆర్కు రుణపడి ఉంటా: తాతా మధు
ABN , First Publish Date - 2021-12-14T17:04:38+05:30 IST
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు.
ఖమ్మం: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. మంగళవారం ఏబీఎన్తో మాట్లాడుతూ కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. క్రాస్ ఓటింగ్పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్రాస్ ఓటింగ్ జరగటం బాధాకరమని, అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసని చెప్పారు. ర్టీ వేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తాతా మధు పేర్కొన్నారు.
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురైంది. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్నే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.