మోదీపై ప్రశంసలు.. ఎమ్మెల్యే సస్పెన్షన్!

ABN , First Publish Date - 2020-08-06T03:58:07+05:30 IST

ప్రధాని మోదీని ప్రశంసించాడని ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

మోదీపై ప్రశంసలు.. ఎమ్మెల్యే సస్పెన్షన్!

చెన్నై: ప్రధాని మోదీని ప్రశంసించాడని ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూ కా సెల్వాన్ని సస్పెండ్ చేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోదీని ప్రశంసించారు. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఆయన పార్టీ నియమావళిని ఉల్లంఘించారని ఆగ్రహించిన డీఎంకే.. సెల్వంను సస్పెండ్ చేసింది. ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో కారణాలు చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని సెల్వం సందర్శించారు. దీంతో ఆయనపై డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - 2020-08-06T03:58:07+05:30 IST