భూసేకరణ పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-07-09T11:11:53+05:30 IST

నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు కింది ఎడమ ప్రధాన కాల్వ కింద భూసేకరణ పనులను ..

భూసేకరణ పనులను పూర్తి చేయాలి

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి


నర్సంపేట, జూలై 8 : నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు కింది ఎడమ ప్రధాన కాల్వ కింద భూసేకరణ పనులను 15రోజుల్లోగా పూర్తిచేయాలని దేవాదుల ప్రాజెక్టు అధికారులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు అధికారులు, ఆర్డీవో, రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. లింక్‌ మెయిన్‌ కెనాల్‌, కుడి కాల్వల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.


ఎడమ ప్రధాన కాల్వ వన్‌ఆ్‌ఫ-70 పరిధిలో ఉన్నందున న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నర్సంపేట మండలం రాజుపేట, నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామాల్లో కొంతమేర భూసేకరణ, కాల్వ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, భూసేకరణ పూర్తి చేసి రైతులకు డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించారు. వచ్చే రబీనాటికి నర్సంపేట నియోజకవర్గంలో 26వేల ఎకరాలకు, ములుగు మండలంలో 7వేల ఎకరాలకు రంగాయచెరువు ప్రాజెక్టు ద్వారా నీరందుతుందని తెలిపారు. సమావేశంలో దేవాదుల ఈఈ సాయిబాబా, డీఈ ఖాధర్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:11:53+05:30 IST