అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ
ABN , First Publish Date - 2020-07-06T01:04:45+05:30 IST
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ తగిలింది. సొంత ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు నిలదీశారు. సీఎం జగన్ ఎక్కడికక్కడ స్థలాలు
విజయవాడ: అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ తగిలింది. సొంత ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు నిలదీశారు. సీఎం జగన్ ఎక్కడికక్కడ స్థలాలు కేటాయించాలని చెప్పినా.. అధికారులు 5 ఊళ్ల అవతల స్థలాలు ఇవ్వడంపై లబ్ధిదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాయలంక వద్ద ఉన్న స్థలాలను వేరే గ్రామాలవారికి కేటాయించి.. తమను దూరంగా వెళ్లమనడం ఏంటని మహిళలు నిలదీశారు. గ్రామానికి దగ్గరలో స్థలాలు అమ్మేవారు లేకపోవడంతో అక్కడ కేటాయించాల్సి రమేష్బాబు వచ్చిందన్నారు.