ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కొవిడ్‌

ABN , First Publish Date - 2022-01-20T05:49:06+05:30 IST

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కొవిడ్‌

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కొవిడ్‌
శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ టౌన్‌, జనవరి 19: మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం వరంగల్‌ జిల్లాలో పంటనష్ట పరిశీలనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మానుకోట ఎంపీ కవిత, భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. కొవిడ్‌ లక్షణాలున్నట్లు అనుమానం రావడంతో వెంటనే పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రకటించారు. తనతో సన్నిహితంగా ఉన్న ప్రజలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా గతంలో కూడా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయనకు రెండో సారి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 

Updated Date - 2022-01-20T05:49:06+05:30 IST