ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ ఎంపీ అర్వింద్

ABN , First Publish Date - 2022-07-14T22:39:46+05:30 IST

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ షకీల్ వర్సెస్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నట్లుగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే షకీల్, అర్వింద్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ ఎంపీ అర్వింద్

బోధన్‌: బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ షకీల్ (MLA Shakeel) వర్సెస్ బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నట్లుగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే షకీల్, అర్వింద్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల బాధలు పట్టించుకోని అర్వింద్‌ను చెప్పుతో కొట్టాలన్నారు. భారీ వర్షాలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలను ఎంపీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్ల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. షకీల్‌కు ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. షకీల్‌ను అర్వింద్ పందితో పోల్చారు. పందులకు తాను సమాధానం చెప్పనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపితే.. వరద సాయం చేయడానికి కేంద్రం రెడీగా ఉందని ప్రకటించారు. వరద నష్టంపై నివేదికలు పంపడానికి టీఆర్‌ఎస్ సర్కార్‌కు చేతకాదని అర్వింద్ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-07-14T22:39:46+05:30 IST