317 జీవోను రద్దు చేయాలి: seethakka

ABN , First Publish Date - 2022-01-12T19:26:11+05:30 IST

అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

317 జీవోను రద్దు చేయాలి: seethakka

హైదరాబాద్: అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 9 మంది ఉపాధ్యాయులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఉద్యోగులతో చర్చలు జరపాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన బదిలిప్రక్రియ చేపట్టాలని తెలిపారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలన్నారు. ట్రైబల్ ఉద్యోగులను మైదానాలకు, అక్కడి ఉద్యోగులను అటవీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. బీజేపీ డ్రామాలు ఆపాలని.. రాష్ట్రపతి చేత ఉత్తర్వులు రద్దు చేపించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-12T19:26:11+05:30 IST