Mla Seethakka: నేను అయితే గొడ్డలితో నరికి చంపేదాన్ని..

ABN , First Publish Date - 2021-07-21T00:10:32+05:30 IST

గిరిజన మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఆర్వోపై ములుగు ఎమ్మెల్యే

Mla Seethakka: నేను అయితే గొడ్డలితో నరికి చంపేదాన్ని..

మహబూబాబాద్: జిల్లాలోని గిరిజన మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఆర్వోపై ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఆర్వోను "నేను అయితే గొడ్డలితో నరికి చంపేదాన్ని" అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లాలో గిరిజన దళిత రైతులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని సీతక్క డిమాండ్ చేశారు. పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు.


గిరిజన మహిళాల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన డీఆర్వోను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఆర్వోను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా తానైతే అయితే గొడ్డలితో నరికి చంపేదాన్నని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. గిరిజనుల జోలికి వస్తే గిరిజన పద్ధతిలో అధికారులను రాళ్లతో కొట్టి తన్ని తరమండని ఆమె పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టన్నీ పకడ్బందీగా అమలు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని సీతక్క ఆరోపించారు. 

Updated Date - 2021-07-21T00:10:32+05:30 IST