రైతు పోరాటం మోదీ మెడలు వంచింది: సీతక్క

ABN , First Publish Date - 2021-11-28T20:26:13+05:30 IST

రైతు పోరాటం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడలు వంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

రైతు పోరాటం మోదీ మెడలు వంచింది: సీతక్క

హైదరాబాద్: రైతు పోరాటం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడలు వంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతివ్వలేదన్నారు. రైతు మరణాలకు అసెంబ్లీలో కూడా సంతాపం తెలుపలేదన్నారు. మిల్లర్లను ఎందుకు మందలించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వరి వద్దంటున్నాయని, మోదీ వ్యతిరేక ఓట్లను ఎంఐఎం నేత ఓవైసీ చీల్చి బీజేపీకి సాయం చేస్తున్నారని సీతక్క విమర్శించారు.

Updated Date - 2021-11-28T20:26:13+05:30 IST