షర్మిలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2021-06-17T00:21:02+05:30 IST

హుజూర్ నగర్ నియోజకవర్గంలో షర్మిల పర్యటనపై ఎమ్మెల్యే శానంపూడి

షర్మిలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్

సూర్యాపేట: హుజూర్ నగర్ నియోజకవర్గంలో షర్మిల పర్యటనపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. షర్మిల కుయుక్త డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన విమర్శించారు. మేడారంలో ఒక నిరుద్యోగి కనపడకుండా పోతే తానే కిడ్నాప్ చేయించానని చెప్పడం విడ్డూరంగా ఉందని సైదిరెడ్డి అన్నారు. ఆత్మగౌరవం అనే నినాదంపై ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రాకు సంబంధించిన మీరు  ఇక్కడికి వచ్చి ఉద్దరించేది ఏమి లేదని షర్మిలపై ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు నియమాలకు వ్యతిరేఖంగా  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి 4 టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలించడంపై షర్మిలమ్మ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-17T00:21:02+05:30 IST