సిటీబస్‌ ఫుట్‌బోర్డుపై Mla ...

ABN , First Publish Date - 2022-03-13T15:11:56+05:30 IST

రువళ్లూరు శాసనసభ్యుడు వీజీ రాజేంద్రన్‌ సిటీ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేశారు. తిరువళ్లూరు సమీపం పూండి వద్ద శనివారం ఉదయం నిరుపేద యువతులకు తాళికి బంగారం ఇచ్చే కార్యక్రమం

సిటీబస్‌ ఫుట్‌బోర్డుపై Mla ...

చెన్నై: తిరువళ్లూరు శాసనసభ్యుడు వీజీ రాజేంద్రన్‌ సిటీ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేశారు. తిరువళ్లూరు సమీపం పూండి వద్ద శనివారం ఉదయం నిరుపేద యువతులకు తాళికి బంగారం ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఆ కార్యంలో పాల్గొన్న రాజేంద్రన్‌ అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు కాలినడకనే బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ చోట బస్‌స్టాప్‌ వద్దనున్న విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. ప్రతిరోజూ తాము రద్దీ అధికంగా ఉండే సిటీ బస్సులోనే వెళుతున్నామని, అదనపు బస్‌ సదుపాయం కల్పించాలని విద్యార్థులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆ లోపున అక్కడికి పూండి నుంచి బయల్దేరాల్సిన సిటీ బస్సు రావడంతో విద్యార్థులందరూ బిరబిరా ఆ బస్సెక్కారు. విద్యార్థులతోపాటు శాసనసభ్యుడు రాజేంద్రన్‌ కూడా ఆ బస్సెక్కారు. అయితే అప్పటికే ఆ బస్సు ప్రయాణికులతో నిండిపోవడంతో ఆయన పుట్‌బోర్డుపై ప్రయాణించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకున్నారు. శాసనసభ్యుడిగా ఉంటూ రాజేంద్రన్‌ సిటీ బస్సు పుట్‌బోర్డుపై ప్రయాణించడం ఏమిటా? అని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు.

Updated Date - 2022-03-13T15:11:56+05:30 IST