ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు: రోజా

ABN , First Publish Date - 2022-03-08T16:08:09+05:30 IST

అమరావతి: రెండో రోజు మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు: రోజా

అమరావతి:  ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సభాపతి తమ్మినేని సీతారాం సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం జగన్ గౌతమ్‌రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ అందరికీ సన్నిహితుడైన, మంచి మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరమన్నారు. ఆయన సంతాప తీర్మాణంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. నగరి నియోజకవర్గం సమస్యలపై గౌతమ్ రెడ్డితో అనేక సార్లు మాట్లాడామన్నారు. ఆయనను నెల్లూరు టైగర్ అని ఆ జిల్లా ప్రజలు పిలుస్తారన్నారు. ఆయన మరణించారంటే ఇప్పటికీ నమ్మసక్యంగా లేదని రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిపక్షాలు కూడా గౌతమ్ రెడ్డి గురించి గొప్పగా చెప్పారన్నారు. ప్రాంతం, కులం, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేవారని, చేతనైన సహాయం చేసేవారని రోజా కొనియాడారు.

Updated Date - 2022-03-08T16:08:09+05:30 IST