సీఎంను కలిసిన ఎమ్మెల్యే రోహిత్
ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST
సీఎంను కలిసిన ఎమ్మెల్యే రోహిత్
- అభివృద్ధి పనులకు జీవోల జారీ పట్ల కృతజ్ఞతలు
తాండూరు, జూలై 5 : సీఎం కేసీఆర్తో మంగళవారం నగరంలోని ప్రగతిభవన్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పలు కీలక పనులకు ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేసినందుకుగాను ఎమ్మెల్యే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాండూరులో పారిశ్రామికవాడ, పాత తాం డూరు రైల్వే వంతెన, నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు, ఆటో నగర్కు స్థల కేటాయింపు జీవోలు జారీ అయిన విషయం విధితమే. తాండూరుకు సంబంధించిన మరికొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించి వినతిపత్రం ఇవ్వగా, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా కోట్పల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునీకరణ, గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తి చేయడం, తాండూరులో నర్సింగ్ కాలేజీ, తట్టేపల్లి మండలం ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు.