శ్రీవారి పుష్కరణి పనులు ఎమ్యెల్యే పరిశీలన

ABN , First Publish Date - 2022-06-23T04:12:58+05:30 IST

బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం ప్రసన్న వేంకటేశ్వర స్వామి పుష్కరణి నిర్మాణ పనులను కావలి ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.

శ్రీవారి పుష్కరణి పనులు ఎమ్యెల్యే పరిశీలన
మాట్లాడుతున్న ఎమ్యెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి

బిట్రగుంట, జూన్‌ 22: బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం ప్రసన్న వేంకటేశ్వర స్వామి పుష్కరణి నిర్మాణ పనులను కావలి ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. కోనేటి దిగువ వేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ పుటింగ్‌ వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీటిని తొలగించి వేగవంతంగా నిర్మాణ పనులు చేయాలని సూచించారు. ప్రసన్న వేంకటేశ్వరుని దర్శించుకొనేందుకు వచ్చిన నూడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ ఎమ్యెల్యేను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మద్దిబోయిన వీరరఘు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, అమరా  వేదగిరి గుప్త, తిరువీధి ప్రసాద్‌, మేకల శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు ఒట్టూరు మాల్యాద్రి, ఓబుల్‌ రెడ్డి, తులసీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-23T04:12:58+05:30 IST