విద్యతోనే జ్ఞానాం, అభివృద్ధి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-12-03T03:42:28+05:30 IST
అక్షరాస్యతతోనే జ్ఞానార్జన, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ప్రతా్పకుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కావలిటౌన్, డిసెంబరు 2: అక్షరాస్యతతోనే జ్ఞానార్జన, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వెంగళరావునగర్లోని 19వ వార్డులో అభి హెల్ప్లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ సహకారంతో ఏపీ అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా ప్రాజెక్ట్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని నిరక్షరాస్యులకు నిరుద్యోగులు అక్షరాలు నేర్పించి ఉపాధి కల్పనకు అక్షర వెలుగు విద్యా ప్రాజెక్ట్ దోహదపడుతుందని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ హసీనా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పట్లో అనేకమంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారని, నేటి సమాజంలో ఏ ఒక్కరు నిరక్షరాస్యులుగా ఉండకూడదన్న లక్ష్యంతో అక్షర భారత్, వెలుగు విద్యా ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పందిటి కామరాజు, కనపర్తి రాజశేఖర్, మండల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.