టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వడ్లు ఎవరు కొన్నారో ఇప్పుడూ కొంటారు
ABN , First Publish Date - 2022-04-08T21:15:18+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వడ్లు ఎవరు కొన్నారో వారే ఇప్పుడూ కొంటారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
నల్గొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వడ్లు ఎవరు కొన్నారో వారే ఇప్పుడూ కొంటారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం పై విమర్శలు చేయడానికి కేసీఆర్ పీకే డైరెక్షన్లో బీజేపీపై విషం చిమ్మే యత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. లండన్లో అవినీతి సొమ్ము 100 కోట్లతో ఎంపీ సంతోష్ ఇల్లు కొనడానికి వెళ్లాడని అన్నారు. సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్లో వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు కట్టుకుంటున్నారని రఘునందన్ ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు.