గ్రావెల్ కుంభకోణంలో ఎమ్మెల్యే ప్రసన్నకీ వాటాలున్నాయి: పోలంరెడ్డి

ABN , First Publish Date - 2020-07-11T23:36:57+05:30 IST

గ్రావెల్ కుంభకోణంలో ఎమ్మెల్యే ప్రసన్నకీ వాటాలున్నాయి: పోలంరెడ్డి

గ్రావెల్ కుంభకోణంలో ఎమ్మెల్యే ప్రసన్నకీ వాటాలున్నాయి: పోలంరెడ్డి

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శలు గుప్పించారు. కోవూరు నియోజకవర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచేస్తుంటే ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని పోలంరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రసన్నకీ వాటాలున్నాయని, వాటాలు లేకుంటే కాణిపాకంలో ప్రమాణం చేయాలని పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ గ్రావెల్ తరలిస్తున్న వాహనాలని సీజ్ చేసిన అధికారులు, ఎలాంటి జరిమానాలు విధించకుండానే వదిలేశారని పోలంరెడ్డి మండిపడ్డారు. నిందితులు పలు కార్యక్రమాల్లో తిరుగుతున్నారని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు.

Updated Date - 2020-07-11T23:36:57+05:30 IST