పెన్నా బకాసురుడు ప్రసన్న
ABN , First Publish Date - 2022-08-15T05:20:26+05:30 IST
పెన్నానది ఇసుకను, పొర్లుకట్టలను దోచుకుంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పెన్నా బకాసురుడిగా అవతారమెత్తారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి విమర్శించారు.
పోలంరెడ్డి ధ్వజం
ఇందుకూరుపేట, ఆగస్టు 14 : పెన్నానది ఇసుకను, పొర్లుకట్టలను దోచుకుంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పెన్నా బకాసురుడిగా అవతారమెత్తారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని మూలకట్టపల్లి పాలెంలో జరి గిన బాదుడే బాదుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్నా పొర్లుకట్టలు, తీర ప్రాంత రక్షణకు రూ.100కోట్లు విడుదలైతే, ఎమ్మెల్యే తన ఐదుగురు అనుచరులకు మాత్రమే ఈ కాంట్రాక్టు ఇచ్చి పెన్నాలోని ఇసుకతోనే కట్టలు నిర్మించి కోట్లకు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం కింద ఆ వివరాలన్ని సేకరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇసుక పొర్లుకట్టలు, తుఫాన్ నిధులు, ఖనిజ సంపదను దోచుకోవడమే కాకుండా బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేయించి జేబులో వేసుకుంటున్నాడన్నారు. ప్రజలు ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమై ందన్నారు. ఉచితంగా డబ్బులు ఇస్తున్నామని ప్రచారం తప్పించి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ఇప్పటికే ప్రజలు ప్రసన్నను తరుముకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు వీరేంద్ర, మొనగాల రంగారావు, చెంచుకిషోర్యాదవ్, పేడూరు రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.