కాల్వలోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే బంధువుల కారు
ABN , First Publish Date - 2022-01-12T03:57:40+05:30 IST
దుర్గి మండలం అడిగొప్పల దగ్గర ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ కుడి కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారులో..
గుంటూరు: దుర్గి మండలం అడిగొప్పల దగ్గర ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ కుడి కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి కజిన్ మదన్ కుటుంబం ఉంది. మదన్ మోహన్రెడ్డిని స్థానికులు కాపాడారు. కారులో మదన్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. స్వగ్రామం నుంచి బయల్దేరిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడి కుటుంబం కారు.. అడిగొప్పల వద్దకు రాగానే కాల్వలోకి దూసుకెళ్లింది.