కృష్ణా జిల్లా: గన్నవరం చేరుకున్న ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర...

ABN , First Publish Date - 2022-03-06T18:18:05+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి రాజధానికి సైకిల్ యాత్ర చేపట్టారు.

కృష్ణా జిల్లా: గన్నవరం చేరుకున్న ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర...

కృష్ణా జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి రాజధానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఆదివారం గన్నవరంకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సోమవారం జరగబోయే అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టానన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగుల మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన పనుల మీద పెట్టడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 90శాతం ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు చేపట్టామన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా జగన్ ప్రభుత్వం 10 శాతం నిర్మాణం కూడా చేపట్టలేక పోయిందని ఎద్దేవా చేశారు. ఆరోజు ఉచిత మని చెప్పి.. ఇప్పుడు పది లక్షల రూపాయలు లబ్ధిదారుల నెత్తిమీద పెడుతోందన్నారు. ఉచితం అని చెప్పిన మాటను జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేసేందుకు రెండు వందల కిలోమీటర్లకు పైగా అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేపట్టానని చెప్పారు. ఈ పాదయాత్రకు మహిళలు, చిరుద్యోగులు, అంగన్‌వాడీ టీచర్స్, వీఆర్ఏలు, ఆశ వర్కర్లు, పెద్ద ఎత్తున తనకు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పెంచిన జీతాలు తప్ప, జగన్ ప్రభుత్వం నిట్టనిలువునా ముంచేసిందని చిరు ఉద్యోగులు వాపోతున్నారని రామానాయుడు అన్నారు.

Updated Date - 2022-03-06T18:18:05+05:30 IST