పాఠశాలలను అభివృద్ధి చేస్తాం..
ABN , First Publish Date - 2021-02-27T05:38:01+05:30 IST
పాఠశాలలను అభివృద్ధి చేస్తాం..
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, ఫిబ్రవరి 26: విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బాగా చదువుకోవాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం 10వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కార్పొరేటర్ కుందారపు రాజేందర్తో కలిసి ఎమ్మెల్యే నరేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం సరిగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు గదుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాన్నారు. త్వరలో నూతన పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్