అవగాహనతోనే కొవిడ్కు కట్టడి
ABN , First Publish Date - 2021-05-06T05:35:44+05:30 IST
కొవిడ్-19 వైరస్పై ప్రజలంతా అవగాహన పెంచుకొంటేనే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా సూచించారు.
ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు, మే 5: కొవిడ్-19 వైరస్పై ప్రజలంతా అవగాహన పెంచుకొంటేనే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా సూచించారు. శారదాకాలనీలో నగర డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం కాలనీలో ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించే కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్వరం, దగ్గు వంటి చిన్నపాటి లక్షణాలు ఉంటే వెంటనే వలంటీర్లను, ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. డైమండ్బాబు మాట్లాడుతూ 50వ డివిజన్లో ప్రజలకు కరోనా నివారణకు మాస్కులు, శానిటైజర్లు, ప్రాథమిక చికిత్స మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేష్, కిరణ్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.