అదనపు పడకలు ఏర్పాటుచేయాలి
ABN , First Publish Date - 2021-04-22T05:07:52+05:30 IST
కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే అదనపు పడకలతో వైద్యసేవలను పెంపొందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని కోరారు.
ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు, ఏప్రిల్ 21: కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే అదనపు పడకలతో వైద్యసేవలను పెంపొందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని కోరారు. జీజీహెచ్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఆస్పత్రిలో వైద్యసేవలపై సూపరింటెండెంట్తో చర్చించారు. వైద్య సేవలు, సౌకర్యాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వైద్య సేవలందించి రోగుల్లో మనోధైర్యం కల్పించాలన్నారు. సూపరింటెండెంట్ స్పందిస్తూ అదనపు పడకలను ఏర్పాటుచేస్తున్నామని, ఈ వారంలో అదనపు సిబ్బందికోసం భర్తీ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైన సౌకర్యాల కోసం తనకు ప్రతిపాదనలు అందజేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా కోరారు.