జగన్‌ పాలనలోనే మహిళాభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-20T04:19:47+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

జగన్‌ పాలనలోనే మహిళాభివృద్ధి
పొదుపు మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

ఎమ్మెల్యే మేకపాటి

దుత్తలూరు, అక్టోబరు 19: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దుత్తలూరు జడ్పీ హైస్కూల్‌లో పొదుపు మహిళలకు రెండో విడత ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు పొదుపు రుణాల మాఫీ కార్యక్రమాన్ని నాలుగు విడతల్లో చేపడుతున్నారన్నారు. 2024లో కూడా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్‌రెడ్డి, జడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ, సొసైటీ అధ్యక్షుడు చేజర్ల చలమారెడ్డి, చంద్రకామేశ్వరరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:19:47+05:30 IST