చంద్రబాబుపై టీడీపీకి దూరమైన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-06-07T00:47:31+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీకి దూరమైన ఎమ్మెల్యే

చంద్రబాబుపై టీడీపీకి దూరమైన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

గుంటూరు : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీకి దూరమైన ఎమ్మెల్యే మద్దాల గిరి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు అనేక ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పడం ఇంకా మానుకోవడం లేదని వ్యాఖ్యానించారు.


రాష్టాన్ని అప్పులు ఊబిలో ముంచి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్టం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదని గిరి చెప్పుకొచ్చారు. ప్రజలు మెచ్చే పాలన అందించామని చెప్పుకొనే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు..? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2020-06-07T00:47:31+05:30 IST