ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కురుమయాదవుల సన్మానం
ABN , First Publish Date - 2022-08-08T04:47:38+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత గొర్రెల పంపీణి పథకం ద్వారా యాదవులకు గొర్రెల పంపీణి చేయనున్నట్లు ప్రకటించడంపట్ల ఆదివారం మండల కురుమయాదవసంఘం నాయకులు హైదరాబాద్లోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆయన గృహంలో కలిసి శాలువాతో సన్మానించారు.
మిడ్జిల్, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత గొర్రెల పంపీణి పథకం ద్వారా యాదవులకు గొర్రెల పంపీణి చేయనున్నట్లు ప్రకటించడంపట్ల ఆదివారం మండల కురుమయాదవసంఘం నాయకులు హైదరాబాద్లోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆయన గృహంలో కలిసి శాలువాతో సన్మానించారు. జిల్లా గొర్రెల సహాకార సంఘం డైరెక్టర్గా ఎన్నికైన వాడ్యాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సినియర్నాయకుడు భీర్ల ఎల్లయ్యయాదవ్ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు కురుమయాదవులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర్, నాయకుఉల రాములు, వినోద్కుమార్, సత్యనారాయణ, లక్ష్మయ్య, రాజు, రామచెంద్రయ్య, మల్లేష్, ఆంజనేయులు, మల్లయ్యలతో పాటు తదితరులున్నారు.