3.52 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-05-17T04:46:43+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు కోవూరు ఎమెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, కమిషనర్‌ శ్రీనివాసరావులతో శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

3.52 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న

బుచ్చిరెడ్డిపాళెం,మే15: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు కోవూరు ఎమెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, కమిషనర్‌ శ్రీనివాసరావులతో శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వవార్డులో రూ. 50లక్షలతో సైడ్‌ డ్రైన్లు, జడ్‌పీ బాలికోన్నత పాఠశాలలో ఫేజ్‌2 కింద కోటీ 2లక్షలతో అదనపు తరగతి గదులు, 3వ వార్డులో 50లక్షలతో డ్రైనేజీలు, బస్టాండ్‌ సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహం నుంచి చెన్నూరురోడ్డు పొడవునా మలిదేవి కాలువ వరకు రూ. కోటితో రోడ్డుకిరువైపులా డ్రైన్లు, జొన్నవాడ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి రాజుపాళెం రోడ్డు సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వరకు రోడ్డుకిరువైపులా డ్రైనేజీ కాలువలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వవ్వేరు బ్యాంచు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రెయిన్‌బో స్కూల్‌లో జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోవడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-05-17T04:46:43+05:30 IST