సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతిపై ఎమ్మెల్యే కన్నబాబు ఫైర్
ABN , First Publish Date - 2021-12-19T20:25:08+05:30 IST
విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ జెల్లి సుభద్ర. అధ్యక్షత వహించారు.
విశాఖపట్నం: విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ జెల్లి సుభద్ర. అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 7 స్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లా అభివృద్ధి పనులకు 2346 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వైస్ చైర్మన్లను వేదికపైకి ఆహ్వానించడంపై ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం లేకపోతే వెళ్లి పోతామని ఎమ్మెల్యే కన్నబాబు అవంతిపై ఫైర్ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక చా౦బర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే సమావేశంలో అలాంటి ప్రోటోకాల్ లేదని అధికారులు చెప్పారు.